రైతుల సమస్యలు పరిష్కరించండి
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:37 PM
రైతులు పండించిన పంటను మిల్లులకు అందజేస్తే ఇంత వరకు నగదు జమ కాలేదని, తగు చర్య లు తీసుకోవాలని రైతుసంఘ నాయకులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో భరత్ నాయక్ను కలిసి వినతిపత్రం అంద జేశారు.
పలాసరూరల్: రైతులు పండించిన పంటను మిల్లులకు అందజేస్తే ఇంత వరకు నగదు జమ కాలేదని, తగు చర్య లు తీసుకోవాలని రైతుసంఘ నాయకులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో భరత్ నాయక్ను కలిసి వినతిపత్రం అంద జేశారు. జీడిపంటపై మంచు పడడంతో నాశనమైందని, బీమాను అమలు చేసి రైతులకు ఆదుకోవాలని, తితలీ తుఫాన్తో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ఉపాధి హామీలో రైతులను అనుసంధానం చేసి వలసలను అరికట్టాలని, జీడికి మద్ద తు ధర రూ.16 వేలు అందజేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారి లో రైతుసంఘ నాయకులు దాసరి శ్రీరాములు, మామిడి మాధవరావు, తామా డ త్రిలోచనరావు, మద్దిల ధర్మారావు, పి.దుర్యోఽధన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 11:37 PM