జగన్ను ఎవరితో పోల్చాలో చెప్పండి.. ప్లీజ్: లోకేశ్
ABN, Publish Date - Mar 04 , 2024 | 03:20 AM
రాష్ట్రాన్ని 12.5లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టాడన్న వార్త చూసి షాక్కు గురైయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు.
అమరావతి, మార్చి3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని 12.5లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టాడన్న వార్త చూసి షాక్కు గురైయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లగా జగన్ తెస్తున్న అప్పులు చూసి, తలపండిన ఆర్థిక వేత్తలకు సై తం మైండ్ బ్లాంక్ అవుతోందని ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘ఏపీని అప్పుల కుప్పగా మార్చి, మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే.. ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారు? ఏపీ సచివాలయాన్ని రూ.380కోట్లకు తాకట్టు పెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదనిపిస్తోంది. ఈ సీఎంను ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావట్లేదు. మీరైనా చెప్పండి ప్లీజ్’!! అని పోస్ట్ చేశారు.
Updated Date - Mar 04 , 2024 | 09:44 AM