ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాతీయ రహదారిపై రెండు కార్లు బోల్తా

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:19 AM

మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండు కార్లు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదాల్లో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు హైవే పెట్రోలింగ్‌ పోలీసులు తెలిపారు.

అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడిన కారు

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 11: మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండు కార్లు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదాల్లో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు హైవే పెట్రోలింగ్‌ పోలీసులు తెలిపారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నుంచి రాజమండ్రి వెళుతున్న కారు గెడ్డపాలెం రోడ్డు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి జాతీయ రహదారికి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ముగ్గురు ప్రయాణికులతో పాటు డ్రైవర్‌ ఉండగా, డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అతనిని నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే విజయవాడ నుంచి విశాఖ వెళుతున్న కారు అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ కారు బోల్తా పడిన సమయంలో వెనుక నుంచి వాహనాలు ఏమీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కారులో సుమారు ఏడేళ్ల బాలుడితో పాటు అతని తండ్రి ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.

Updated Date - Feb 12 , 2024 | 12:19 AM

Advertising
Advertising