ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన..

ABN, Publish Date - Jan 03 , 2024 | 08:18 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో బుధవారం నుంచి మూడు రోజులపాటు పర్యటనలు కొనసాగనున్నాయి. నిజం గెలవాలి పేరుతో వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలుంటాయి.

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (TDP Chief Chandrababu Wife Nara Bhuvaneshwari) మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో బుధవారం నుంచి మూడు రోజులపాటు పర్యటనలు కొనసాగనున్నాయి. నిజం గెలవాలి పేరుతో వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలుంటాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో పర్యటన కొనసాగనుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో, గురువారం శ్రీకాకుళం జిల్లా, శుక్రవారం విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఇప్పటికే ఒకసారి వెళ్లి కొన్ని కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించిన విషయం తెలిసిందే.

కాగా.. అక్రమంగా అరెస్ట్‌ అయిన చంద్రబాబు నాయుడు విడుదల కోసం సతీమణి భువనేశ్వరి చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. చంద్రబాబు అరెస్ట్ నుంచి రాజమండ్రిలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు. చంద్రబాబు విడుదల కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భువనేశ్వరి చురుగ్గా పాల్గొన్నారు. ప్రజల్లోనే ఉంటూ.. వారి సాదకబాధలను కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మనస్థాపంతో చనిపోయిన వారి కుటుంబాలను కూడా భువనేశ్వరి పరామర్శించారు.

Updated Date - Jan 03 , 2024 | 08:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising