ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pennsylvania: 17 మందిని చంపిన నర్సుకు 760 ఏళ్ల జైలు!

ABN, Publish Date - May 05 , 2024 | 05:03 AM

అమెరికాలో ఇన్సులిన్‌ డోసు పెంచి 17 మంది మరణానికి కారణమైన నర్సు హీథర్‌ ప్రెస్సిడీ(41)కి పెన్సిల్వేనియా కోర్టు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

పెన్సిల్వేనియా, మే 4: అమెరికాలో ఇన్సులిన్‌ డోసు పెంచి 17 మంది మరణానికి కారణమైన నర్సు హీథర్‌ ప్రెస్సిడీ(41)కి పెన్సిల్వేనియా కోర్టు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రోగుల పట్ల విసుగు చెందడం వల్లనే వారి ప్రాణాలు తీసినట్లు హీథర్‌ విచారణలో అంగీకరించింది. 2020 నుంచి 2023 మధ్యలో మొత్తం 17 హత్య కేసులు ఆమెపై నమోదు కాగా.. కోర్టు మూడు హత్యలు, 19 హత్యాయత్నాల కేసుల్లో హీథర్‌ను దోషిగా తేల్చింది.


వైద్య సిబ్బందే రోగుల ప్రాణాలు తీసిన సంఘటనలు గతంలోనూ అమెరికాలో చోటుచేసుకున్నాయి. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో ఛార్లెస్‌ కల్లెన్‌ అనే వ్యక్తి 29 మంది రోగులకు హై డోస్‌ ఇన్సులిన్‌ ఇచ్చి ప్రాణాలు తీశాడు. టెక్సా్‌సలో ఓ వ్యక్తి నలుగురు రోగుల ధమనుల్లోకి గాలి పంపించి చంపేశాడు.

Updated Date - May 05 , 2024 | 05:03 AM

Advertising
Advertising