ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో నర్సుపై హత్యాచారం

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:12 AM

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సుపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో చోటుచేసుకుంది. సంఘటన జరిగిన తొమ్మిది రోజుల అనంతరం ఆమె మృత దేహం లభించింది. దర్యాప్తు జరిపిన పోలీసులు బుధవారం ఇందుకు బాధ్యుడైన నిందితుడ్ని రాజస్థాన్‌లో

9 రోజుల తర్వాత దొరికిన మృతదేహం

రాజస్థాన్‌లో నిందితుడి అరెస్టు

ఆమె చున్నీతోనే ప్రాణాలు తీశాడు

డెహ్రాడూన్‌, ఆగస్టు 15: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సుపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో చోటుచేసుకుంది. సంఘటన జరిగిన తొమ్మిది రోజుల అనంతరం ఆమె మృత దేహం లభించింది. దర్యాప్తు జరిపిన పోలీసులు బుధవారం ఇందుకు బాధ్యుడైన నిందితుడ్ని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆ నర్సు ఇంద్రాచౌక్‌లోని ఆస్పత్రిలో పనిచేస్తుండగా, సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని బిలా్‌సపూర్‌లో 11 ఏళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. జులై 30న విధులు ముగించుకొని ఈ-రిక్షాలో బిలా్‌సపూర్‌ బయలుదేరింది. దినసరి కూలీ అయిన ధర్మేంద్ర ఆమెను అనుసరించాడు. ఆమె తాను నివాసం ఉండే అపార్టుమెంటుకు చేరుకుంటుందనగా దాడి చేశాడు. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె చున్నీతోనే పీక నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని దిబ్‌డిబా గ్రామంలోని ఖాళీ స్థలంలో పడేసి వెళ్లిపోయాడు. ఆమె పర్సులోని రూ.3000ను కూడా దొంగిలించాడు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి మరుసటి రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 8న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి ఫోన్‌ ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. అతడు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా వాసి అని తేలింది. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడ్ని రాజస్థాన్‌లో పట్టుకొని అరెస్టు చేశారు.

Updated Date - Aug 16 , 2024 | 05:12 AM

Advertising
Advertising
<