బాంబు పేలుళ్ల కేసులో కరీం తుండా నిర్దోషి
ABN, Publish Date - Mar 01 , 2024 | 02:56 AM
వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ కరీం తుండా (81) నిర్దోషి అని గురువారం అజ్మీర్లోని టాడా కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాదయిన సందర్భాన్ని పురస్కరించుకొని 1993 డిసెంబరు 5, 6 తేదీల
జైపూర్, ఫిబ్రవరి 29: వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ కరీం తుండా (81) నిర్దోషి అని గురువారం అజ్మీర్లోని టాడా కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాదయిన సందర్భాన్ని పురస్కరించుకొని 1993 డిసెంబరు 5, 6 తేదీల అర్ధరాత్రి అయిదు చోట్ల వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, లఖ్నవూ, కాన్పూర్, సూరత్, ముంబయిల్లోని అయిదు రైళ్లలో ఆ బాంబులు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు తుండాతో పాటు ఇర్ఫాన్ అలియాస్ పప్పు, హమీదుద్దీన్లపై కేసులు పెట్టారు. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు చూపట్టలేకపోవడంతో ఆయనను విడుదల చేస్తున్నట్టు జడ్జి తెలిపారు. మిగిలిన ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
Updated Date - Mar 01 , 2024 | 02:56 AM