ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ooty: ఊటీ కొండకు అదనపు రైలు సర్వీసులు

ABN, Publish Date - Jan 17 , 2024 | 09:33 AM

పర్యాటకుల కోసం ఊటీ కొండ రైలు(Ooty Hill Train) సేవలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో నీలగిరి జిల్లా ఊటీకి వస్తున్న పర్యాటకులు అధికంగా కొండ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పెరంబూర్‌(చెన్నై): పర్యాటకుల కోసం ఊటీ కొండ రైలు(Ooty Hill Train) సేవలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో నీలగిరి జిల్లా ఊటీకి వస్తున్న పర్యాటకులు అధికంగా కొండ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోమవారం కున్నూర్‌ - ఊటీ మధ్య నాలుగు సార్లు నడిపిన కొండ రైళ్లలోని ఐదు బోగీల్లో 300 మంది ప్రయాణించారు. మేట్టుపాళయం-ఊటీ మధ్య ఒకసారి మాత్రమే నడుపు తున్న కొండ రైలులో 210 మంది ప్రయాణించారు. అదే సమయంలో మేట్టు పాళయం నుంచి కున్నూర్‌కు మూడు బోగీలతో రైలు నడుపుతున్న రైలుకు కున్నూర్‌లో అదనంగా మరో రెండు బోగీలు అనుసంధానం చేశారు. ఈ నెల 21, 26, 28 తేదీలు, మేట్టుపాళయం నుంచి ఊటీకి 18, 25 తేదీల్లో ప్రత్యేక కొండ రైలు సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 09:33 AM

Advertising
Advertising