ఈపీఎస్ కనీస పింఛన్లో మార్పు లేదు
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:48 AM
ఈపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన నెలవారీ కనీస పింఛన్ రూ.1000ని రెట్టింపు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించింది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.1000గా ఉన్న
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఈపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన నెలవారీ కనీస పింఛన్ రూ.1000ని రెట్టింపు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించింది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.1000గా ఉన్న కనీస పింఛను రూ.2000 కావాల్సి ఉంది. ఈ మేరకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎ్ఫవో)కు చెందిన ఉన్నత స్థాయి నిర్ణాయక బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ్స(సీబీటీ) రూ.1000 పింఛనును రూ.2000లకు పెంచాలని ఇటీవల ప్రతిపాదించగా శనివారం ఆర్థిక శాఖ దీనిని తోసిపుచ్చింది. ‘‘రిటైర్డ్ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేం ఈ ప్రతిపాదన చేశాం. కానీ, ఆర్థిక శాఖ అంగీకరించలేదు’’ అని సీబీటీ తెలిపింది.
Updated Date - Feb 13 , 2024 | 08:43 AM