ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులైన భారతీయులకు యూఏఈ వీసా-ఆన్‌-అరైవల్‌

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:15 AM

భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వీసా-ఆన్‌-అరైవల్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

న్యూఢిల్లీ, అక్టోబరు 18: భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వీసా-ఆన్‌-అరైవల్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ప్రవాసులను ఆకర్షించడంతో పాటు యూఏఈకి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అర్హులైన భారత పౌరులకు 14 రోజుల వ్యవధితో కూడిన వీసా-ఆన్‌-అరైవల్‌ సదుపాయాన్ని యూఏఈ కల్పిస్తోందని అక్కడి భారత రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ప్రయాణికులు కనీసం 6నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టును కలిగి ఉండటంతో పాటు అమెరికా జారీ చేసిన గ్రీన్‌కార్డు/ వీసా, యూరోపియన్‌ యూనియన్‌, యూకే దేశాలు మంజూరు చేసిన చెల్లుబాటయ్యే శాశ్వత నివాస పత్రం/ వీసా ఉన్నవారు అర్హులని వివరించింది. వీరికి తొలుత 14 రోజుల గడువున్న వీసా మంజూరు చేస్తారు. తర్వాత తగిన రుసుము చెల్లించి దీన్ని 60 రోజులు పొడిగించుకొనే అవకాశం ఉంది.

Updated Date - Oct 19 , 2024 | 04:15 AM