ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uttar Pradesh: ఓరి దుర్మార్గుడా.. ఆ ఒక్క మాట అన్నందుకు గొంతులో పొడిచేశాడు..!

ABN, Publish Date - Jan 06 , 2024 | 03:17 PM

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి(25)ని కత్తితో మెడపై పొడిచాడు ఆమె బంధువు. ఇందుకు కారణం ఆయన ప్రపోజల్‌కు ఆమె అంగీకరించకపోవడమే. మరి ఇంతకీ ఆ కీచకుడి ప్రపోజల్ ఏంటి? ఆమె ఏం అన్నది? అతను ఎందుకు పొడిచాడు? పోలీసులు తెలిపిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

Uttar Pradesh Woman Stabbed

లక్నో, జనవరి 06: ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి(25)ని కత్తితో మెడపై పొడిచాడు ఆమె బంధువు. ఇందుకు కారణం ఆయన ప్రపోజల్‌కు ఆమె అంగీకరించకపోవడమే. మరి ఇంతకీ ఆ కీచకుడి ప్రపోజల్ ఏంటి? ఆమె ఏం అన్నది? అతను ఎందుకు పొడిచాడు? పోలీసులు తెలిపిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

బందా జిల్లాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎం కాలనీలో యువతి తన మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఆమె మామ కుమారుడు జ్ఞాన్ ప్రకాష్(26) కూడా ఆమెతో కలిసి ఒకే కాలేజీలో లా చేస్తున్నాడు. అయితే, శుక్రవారం నాడు సాయంత్రం పర్సనల్‌గా మాట్లాడాలంటూ ప్రకాష్ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. అప్పుడే తన మనసులోని మాటను బయటపెట్టాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమెకు తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే, యువతి అతనితో పెళ్లికి నిరాకరించింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అప్పటికే ప్లాన్ ప్రకారం తన వెంటన తెచ్చుకున్న కత్తితో యువతి మెడపై బలంగా నరికాడు, గొంతులో పొడిచాడు. అనంతరం ప్రకాష్ అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్న యువతిని స్థానికులు గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బందా ఏఎస్పీ లక్ష్మీ నివాస్ మిశ్రా తెలిపారు. వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకే యువతిపై ప్రకాష్ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, నిందితుడు దొరికితే మరింత సమాచారం బయటకొచ్చే అవకాశం ఉందని తెలిపారు మిశ్రా.

Updated Date - Jan 06 , 2024 | 03:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising