గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చాం..: మోదీ
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:45 AM
తమ పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉద్యోగాలిచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా మార్చామని.. జాప్యం లేకుండా సకాలంలో ఉద్యోగాలను
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: తమ పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉద్యోగాలిచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా మార్చామని.. జాప్యం లేకుండా సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ‘రోజ్గార్ మేళా’లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన లక్షకు పైగా మందికి సోమవారం ఆయన నియామక పత్రాలను వర్చువల్గా అందజేశారు. ఉద్యోగ నియామకాలప్రక్రియను జాప్యం చేస్తూ గత ప్రభుత్వం లంచగొండితనాన్ని పెంచి పోషించిందన్నారు. యువతకు ఇప్పుడు సమాన అవకాశాలున్నాయని.. ప్రతిభ, కృషి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని నమ్ముతున్నారని చెప్పారు.
Updated Date - Feb 13 , 2024 | 08:52 AM