ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:10 PM

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10వ తేదీన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కుటుంబ సభ్యులు ఆయన్ని చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుది శ్వాస విడిచారు.

1/9

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.

2/9

అనారోగ్యంతో సెప్టెంబర్ 10వ తేదీన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

3/9

1952, ఆగస్ట్ 12వ తేదీన చెన్నైలో సీతారాం ఏచూరి జన్మించారు.

4/9

1974లో ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ)లో చేరారు.

5/9

జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌ ప్రెసిడెంట్‌గా మూడు సార్లు సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. అనంతరం ఆల్ ఇండియా ఎస్‌ఎఫ్ఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

6/9

1984లో సీపీఐ(ఎం) సెంట్రల్ కమిటీకి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. అనంతరం శాశ్వత ఆహ్వానితుడిగా ఆయనను పార్టీ ఎంపిక చేసింది.

7/9

ఆ తర్వాత పాలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీ నియమించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన సభ్యుడిగా కొనసాగారు.

8/9

2005లో సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

9/9

2018, 2022లో సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండు సార్లు ఎన్నికయ్యారు.

Updated Date - Sep 12 , 2024 | 05:10 PM

Advertising
Advertising