ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: ఎస్సీ వర్టీకరణపై మోదీ, మందక్రిష్ణ నాటకాలాడుతున్నారు

ABN, Publish Date - Mar 01 , 2024 | 10:52 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, మార్చి 1: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీకి మందక్రిష్ణ మాదిగ వత్తాసు పలికారని వర్గీకరణ అంశంలో ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని మాల మహానాడుఆఫ్‌ఇండియా జాతీయ అధ్య క్షుడు పసుల రాంమూర్తి అన్నారు.

- మాల మహానాడు ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రాంమూర్తి

కాగజ్‌నగర్‌ టౌన్‌, మార్చి 1: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీకి మందక్రిష్ణ మాదిగ వత్తాసు పలికారని వర్గీకరణ అంశంలో ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని మాల మహానాడుఆఫ్‌ఇండియా జాతీయ అధ్య క్షుడు పసుల రాంమూర్తి అన్నారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్టీకరణపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందక్రిష్ణ మాదిగ, ప్రధానమంత్రి మోదీ నాటకాలను అందరూ వ్యతిరేకించాలన్నారు. వచ్చేపార్లమెంటు ఎన్నికల్లో ఆయా పార్టీలు 3చోట్ల మాలలకే టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిచో పెద్దపల్లి, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌ 3రిజర్వ్‌ నియోజకవర్గాల్లో 100మంది అభ్యర్థులను పోటీలో దింపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టం తొలగించే కుట్రలు చేస్తుందని ఈకుట్రలను తిప్పి కొడతామన్నారు. వచ్చేఎన్నికల్లో మాలలంతా ఐక్యంగాఉండి హక్కుల సాధనకు నడుం బిగించాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మాలలంతా ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాల మహానాడు ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు దుండ్ర శ్రీనివాస్‌, జాతీయ ఉపాధ్యక్షుడు పుల్లయ్య, రాష్ట్ర నాయకులు కాసర్ల యాదగిరి, రాజనర్సు, వెంకటి కుమార్‌, ఎర్రోళ్ల ఎల్లయ్య, చింతల సత్తయ్య, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 10:52 PM

Advertising
Advertising