ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లోన్‌యాప్‌ ఏజెంట్ల వేధింపులకు మరో ప్రాణం బలి!

ABN, Publish Date - Feb 29 , 2024 | 04:51 AM

లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులకు మరో ప్రాణం బలైంది. సిరిసిల్లకు చెందిన చిప్ప సాయిరాజు(28) అనే యువకుడు మానేరుడ్యాంలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 28: లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులకు మరో ప్రాణం బలైంది. సిరిసిల్లకు చెందిన చిప్ప సాయిరాజు(28) అనే యువకుడు మానేరుడ్యాంలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలో పవర్‌లూం కార్మికుడిగా పని చేసే సాయిరాజు ఓ లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకుని సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో ఏజెంట్లు ఫోన్లు చేసి రుణం చెల్లించాలని వేధించేవారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిన సాయిరాజు రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో సాయిరాజు భార్య సంధ్యారాణి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరాజు కోసం గాలించగా మానేరుడ్యాం ఒడ్డున అతని ద్విచక్రవాహనం కనిపించింది. సాయిరాజు మృతదేహం మానేరుడ్యాం ఒడ్డుకు బుధవారం కొట్టుకొచ్చింది.

Updated Date - Feb 29 , 2024 | 10:53 AM

Advertising
Advertising