సీఎం చావును కోరుకుంటారా?
ABN, Publish Date - Feb 15 , 2024 | 03:54 AM
తెలంగాణలో ఎప్పటికీ అధికారంలో ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్ ఎంతకైనా
అధికారం కోసం ఇంతలా దిగజారతారా?
కేసీఆర్పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ధ్వజం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎప్పటికీ అధికారంలో ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్ ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ‘ఎప్పుడు చస్తావ్.. అని సీఎంను ఉద్దేశించి అంటున్నారు. ఆయన చస్తే సీఎం కుర్చీ దక్కుతుందన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. అధికారం కోసం ఇంతగా దిగజారతారని ఊహించలేదు’ అని వ్యాఖ్యానించారు. రూ.వేల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్, అవినీతి ఆరోపణలపై ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాను మేడిగడ్డ పర్యటనకు వెళ్లబట్టే క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగినట్లు చెప్పారు. భారీ ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులకు మూడేళ్లకే పగళ్లు వస్తే వాటి భవిష్యత్తు ఏంటని నిలదీశారు. ప్రాజెక్టుల పేరిట దోచుకున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో తెలంగాణ నంబర్-1 అంటూ గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్న మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.
Updated Date - Feb 15 , 2024 | 10:40 AM