మాదిగలకే పెద్దపల్లి సీటు ఇవ్వాలి
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:05 AM
పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని పెద్దపల్లి పార్లమెంట్ మాదిగ ఐక్య వేదిక నాయకులు సోమవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కలిశారు.
మాదిగ ఐక్య వేదిక నాయకులు
మందమర్రి టౌన్, ఫిబ్రవరి 12: పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని పెద్దపల్లి పార్లమెంట్ మాదిగ ఐక్య వేదిక నాయకులు సోమవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కలిశారు. వారు మాట్లాడుతూ దశాబ్దన్నర క్రితం ఈ సీటు ను టీడీపీ పార్టీ మాదిగలకు కేటాయించిందని వారు తెలిపారు. పార్లమెంట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి తమ ఉప కులాలకు సీట్లు కేటాయిస్తున్నారని, ఈసారి మాదిగలకు కేటాయించేలా చూడాలన్నారు. ఆయా పార్టీల్లో పని చేస్తున్న మాదిగ అభ్యర్ధులకు సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు. మెజారిటీ ఓటర్లు మాదిగలే ఉన్నారని, అంతే కాకుండా అన్ని పార్టీల నాయకులను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు కె పాపయ్య, విజయ్ ప్రభాకర్, పల్లె సదానందం, నాతారి పోష య్య, ఎన్ బాపయ్య, లక్ష్మణ్, తిరుపతి, శంకర్, తదితరులు ఉన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:05 AM