ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vinod Kumar: ఫేక్ వార్తను బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది

ABN, Publish Date - Jan 07 , 2024 | 12:45 PM

కరీంనగర్: మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బోయినపల్లి సరిత తన అన్న కూతురు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్: మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బోయినపల్లి సరిత తన అన్న కూతురు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇచ్చామని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఫేక్ వార్తను బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిందన్నారు.

అసలు తనకు అన్న అంటూ ఎవరు లేరని, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. తీన్మార్ మల్లన్న వార్త ప్రసారం చేసేటప్పుడు తనను వివరణ కోరలేదన్నారు. బోయినపల్లి సరిత ఇంటి పేరు ఒకటైతే తనకు ముడిపెట్టడం కరెక్టా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ముంచి పరారైన నీరవ్ మోదీ ఇంటి పేరు మోదీ ఉంటే.. ప్రధానమంత్రి మోదీకీ కూడా సంబంధం ఉన్నట్లా అని నిలదీశారు. ఎంపీ ఎన్నికల్లో లబ్ది కోసం బండి సంజయ్ దుష్ప్రచారం చేయించడం సరికాదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 07 , 2024 | 12:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising