ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొలువుదీరిన మత్స్య సహకార సంఘం జిల్లా కార్యవర్గం

ABN, Publish Date - Mar 12 , 2024 | 11:10 PM

నారాయణపేట జిల్లా మత్స్య సహకార సొసైటీ పాలక వర్గం మంగళవారం కొలువు దీరింది.

ఎన్నికైన నూతన కార్యవర్గం

నారాయణపేట, మార్చి 12 : నారాయణపేట జిల్లా మత్స్య సహకార సొసైటీ పాలక వర్గం మంగళవారం కొలువు దీరింది. ఈనెల 9న నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన 11 మంది డైరెక్టర్లకు ఎన్నికల అధికారి టైటాస్‌ పాల్‌ నియామక పత్రాలు అందించారు. మంగళవారం మత్స్య సహకార కార్యాలయంలో గెలుపొందిన డైరెక్టర్ల ఆధ్వర్యంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా జాజాపూర్‌ కాంతుకుమార్‌, ఉపాధ్యక్షుడిగా నీరటి నర్సింహులు నాయుడు (ధన్వాడ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అందరి సహకారంతో మత్య్స సహకార సంఘం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ పరంగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్య్స శాఖ ఏడీ రాణా ప్రతాప్‌, మాజీ అధ్యక్షుడు వెంకటేశ్‌, నాయకులు అంజయ్య చారి, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌, ఈదప్ప, నారాయణ, నర్సింహులు, శ్రీను, కృష్ణయ్య, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:10 PM

Advertising
Advertising