కిరాణ దుకాణంలో చోరీ
ABN, Publish Date - Feb 29 , 2024 | 12:29 AM
మండల కేంద్రంలోని రాంనగర్కాలనీలో ఓ కిరాణం దుకాణంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
ఆత్మకూరు(ఎం) ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని రాంనగర్కాలనీలో ఓ కిరాణం దుకాణంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన పైళ్ల దామోదర్రెడ్డి తన కిరాణం దుకాణాన్ని రాత్రి 10గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి దుకాణం తీయడానికి రాగా తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా గల్లపెట్టెలో ఉన్న సుమారు రూ.60 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ డి.నాగరాజు తోపాటు క్లూస్ టీం బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - Feb 29 , 2024 | 12:29 AM