సీఎంను కలిసిన ’చింపుల’
ABN, Publish Date - Mar 12 , 2024 | 12:04 AM
తనను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎ్సపీసీబీ) సభ్యుడిగా నియమించినందుకు చింపుల సత్యనారాయణరెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, మార్చి 11 : తనను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎ్సపీసీబీ) సభ్యుడిగా నియమించినందుకు చింపుల సత్యనారాయణరెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సత్యనారాయణరెడ్డి సోమవారం సీఎం నివాసానికి వెళ్లి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందించారు. తనపై నమ్మకంతో కేటాయించిన పదవికి న్యాయం చేస్తానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేసే బాధ్యత బోర్డు సభ్యుడిగా తనపై ఉందని గుర్తు చేశారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.
Updated Date - Mar 12 , 2024 | 12:04 AM