ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యువకుడిపై ‘పోక్సో కేసు’

ABN, Publish Date - Mar 09 , 2024 | 12:21 AM

ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించటంతో బాధిత కుటుంబం శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దాంతో యువకుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు

ఆరేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన..

ధారూరు, మార్చి 8: ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించటంతో బాధిత కుటుంబం శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దాంతో యువకుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఎస్సై వేణుగోపాల్‌గౌడ్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6) ను అదే గ్రామానికి చెందిన జగదీశ్‌(18) అనే యువకుడు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని చెప్పి శుక్రవారం తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక తల్లికి చెప్పడంతో.. ఆమె యువకుడిని, అతడి తల్లిని ప్రశ్నించింది. దాంతో కోపోద్రిక్తులైన వారిద్దరూ ఆమెపై రాయితో దాడిచేశారు. తలకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆమెను బూతులు తిట్టారు. ఈమేరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి యువకుడు జగదీష్‌పై పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:21 AM

Advertising
Advertising