స్కూల్ విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
ABN, Publish Date - Feb 12 , 2024 | 11:40 PM
వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి జూబేర్ను పాఠశాలలో ఉపాధ్యాయుడు నర్సింహులు చితకబాదాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
వికారాబాద్, ఫిబ్రవరి 12: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి జూబేర్ను పాఠశాలలో ఉపాధ్యాయుడు నర్సింహులు చితకబాదాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బాలున్ని వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య స్కూల్ నుంచి టీచర్ నర్సింహులుపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే తొలగించాలని స్కూల్ వద్ద ఆందోళన చేశారు.
Updated Date - Feb 12 , 2024 | 11:40 PM