Home » MLC Elections
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలను ఎందుకు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్సీలు ఏమి చేస్తారు. శాసనమండలి సభ్యుల బాధ్యత ఏమిటి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఏమవుతుందనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరికొద్ది గంటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా కొందరు అభ్యర్థులు బుధవారం రాత్రి ఓటర్లకు గప్చు్పగా డబ్బు పంపీణీ చేశారు. నల్లగొండలో ఓ అభ్యర్థి తరఫున అనుయాయులు ఒక్కో ఓటరు ఇంటికి వెళ్లి రూ.2 వేలు అందజేయగా, మరో ఇద్దరు అభ్యర్థులు రూ.1,000 నుంచి రూ.1,200, రూ.2500 ఇచ్చారని సమాచారం.
రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ గురువారం జరగనుంది.
ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా - గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.
తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలుపెవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల...
అమరావతి: ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపుతున్నారు. ఆయా కేంద్రాలవద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
‘ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి...
తనను గెలిపిస్తే ఆరు నెల ల్లో మహిళా ఉపాధ్యాయులందరికీ ఎలక్ట్రిక్ బైక్లు అందజేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి హామీ ఇస్తున్నారు.