ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghunandan Reddy: రోహిత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు

ABN, First Publish Date - 2022-12-19T11:38:45+05:30

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (TRS MLA Pilot Rohith Reddy)అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP MLA Raghunandan Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు చెప్పారని విరుచుకుపడ్డారు. డ్రగ్స్‌ తీసుకోలేదని రోహిత్‌రెడ్డి ఎందుకు ప్రమాణం చేయట్లేదని ప్రశ్నించారు. దొరలు తిరిగే కారు కావాలా.. అన్నంపెట్టే చేయి కావాలా అంటూ.. గత ఎన్నికల్లో రోహిత్‌రెడ్డి ప్రచారం చేశారని.. ఇప్పుడు అదే దొరల కాంపౌండ్‌లో రోహిత్‌రెడ్డి చేరారని వ్యాఖ్యలు చేశారు. 2009 కంటేముందు స్వీడన్‌ వర్సిటీలో చదివినట్లు అఫిడవిట్‌లో చెప్పారన్నారు. 2018 నాటికి ఇంటర్‌గా ఎలా మారిందో రోహిత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్హతల విషయంలో రోహిత్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంతో రోహిత్‌రెడ్డికి సంబంధం లేదని రఘునందన్ అన్నారు.

Updated Date - 2022-12-19T11:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising