ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapuram Dist.: మళ్లీ అధికారంలోకి వస్తాం..మీ అంతు చూస్తాం..ఎమ్మెల్యే బెదిరింపు..

ABN, First Publish Date - 2023-04-15T15:39:01+05:30

వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ (YCP)యే అధికారంలోకి వస్తుందని, టీడీపీ (TDP) సానుభూతిపరులందరికీ ఇప్పుడు అందుతున్న పథకాలు రద్దుచేస్తామని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం జిల్లా: వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ (YCP)యే అధికారంలోకి వస్తుందని, టీడీపీ (TDP) సానుభూతిపరులందరికీ ఇప్పుడు అందుతున్న పథకాలు రద్దుచేస్తామని, మీ అంతు చూస్తామని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) హెచ్చరించారు. అనంతపురం జిల్లా, కణేకల్లు మండలం, బ్రహ్మసముద్రంలో గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేపథకాల గురించి వివరించారు. ఆ గ్రామంలో టీడీపీ కార్యకర్త వన్నూరు స్వామి ఇంటి వద్దకు వెళ్లి ఆయనకు అందిన పథకాల గురించి చదివి వినిపించారు. కానీ తనకు విద్యాదీవెన డబ్బు అందకపోయినా.. అందినట్లు జాబితాలో ఉందని స్వామి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి.. ‘నువ్వు టీడీపీకి చెందినవాడివి.. ఇతని వెంట తిరిగితే మీకు కూడా పథకాలు అందవని’ హెచ్చరించారు. వచ్చే ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందకుండా చేస్తానని బెదిరించారు.

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బెదిరింపులు ఏ తరహాలో ఉంటాయో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు అందడంలేదని ప్రజలు సమస్యలు లేవనెత్తితే.. ఎందుకు అందడంలేదని అధికారులను పిలిచి మాట్లాడకుండా.. ఏకంగా ఫిర్యాదు చేసిన వారినే బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులు నివ్వెరపోయారు. సమస్యలు లేవనెత్తితో పరిష్కరించాల్సిందిపోయి.. ఈ తరహాలో బెదిరించడం ఏంటంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2023-04-15T15:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising