ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎం జగన్ చెప్పిన విషయాలు ఇవే

ABN, First Publish Date - 2023-06-13T18:05:06+05:30

మీరు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి నేతలతో సీఎం జగన్ (CM Jagan) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మీరు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి నేతలతో సీఎం జగన్ (CM Jagan) అన్నారు. తన తరపు నుంచి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రతి కార్యక్రమంలో కూడా మనసా వాచా ప్రయత్నిస్తానని చెప్పారు. కొందరు రకరకాల రాజకీయ కారణాలతో, కోణాలతో వాతావరణాన్ని విషతుల్యం చేయాలని చూస్తారని, దానిని నమ్మొద్దన్నారు. తన మనస్సు ఎప్పుడు ఉద్యోగులకు మంచి చేయాలనే చూస్తుందన్నారు. చరిత్రలోనే మొదటిసారి ఉద్యోగుల సమస్యలను అలానే వదిలేయకుండా పరిష్కారం సూచించామని చెప్పారు. ఆ పరిష్కారం వల్ల మీకు మేలు జరగాలని ప్రయత్నించామని తెలిపారు. జీపీఎస్ కసరత్తుకు తమకు రెండు సంవత్సరాలు పట్టిందన్నారు. ఇది విన్ విన్ ఫార్ములాగా పేర్కొన్నారు. 2045 , 2050 లలో కూడా అప్పటి వారు జగన్ ఏం చేసినా రాష్ట్రానికి మంచి చేశారని, ఉద్యోగులకు మంచి చేశారు అనే మాటే వినిపించాలని సూచించారు. ఉద్యోగులు తీసుకునే జీతంలో బేసిక్‌లో 50 శాతం వచ్చేలా దానిలో తరుగుదల లేకుండా చూశామని పేర్కొన్నారు. లక్షా 35 వేల మంది సచివాలయ ఉద్యోగస్థులు అందరు దీనిలోనే ఉన్నారని, వీరందరినీ ఈ ప్రభుత్వంలోనే తీసుకున్నామన్నారు. వీరి నుంచి కూడా జగన్ తమకు మంచి చేశారు అనే మాట రావాలన్నారు. రేపు ఈ జీపీఎస్ అనేది దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. ఈ మాటలు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.

Updated Date - 2023-06-13T18:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising