BJP: తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2023-01-04T16:06:39+05:30

ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల (Tirumala)ని కొందరు రాజకీయ నాయకులు రాజకీయ క్షేత్రంగా మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఆరోపించారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకే కొందరు

BJP: తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే అడ్డుకుంటాం
అడ్డుకుంటాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల (Tirumala)ని కొందరు రాజకీయ నాయకులు రాజకీయ క్షేత్రంగా మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఆరోపించారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకే కొందరు రాజకీయ నాయకులు తిరుమలకు వస్తున్నారని విమర్శించారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం ఉన్నప్పటికీ.. కొందురు రాజకీయాలు మాట్లాడుతున్నా టీటీడీ (ttd) అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. ఇప్పటికైనా టీటీడీ స్పందించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు అడ్డుకోవాలని కోరారు. రాజకీయ ప్రసంగాలు చేసే వారి వద్ద నుంచి టీటీడీ శ్రీవారి కానుక (TTD Srivari Kanuka)ను వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ స్పందించకపోతే రాజకీయ ప్రసంగాలు చేసే వారిని తిరుపతిలో బీజేపీ(bjp) అడ్డుకుంటుందని భానుప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-01-04T16:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising