Share News

వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2023-11-27T01:10:12+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా ఆదివారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తికి జ్ఞాపికను అందిస్తున్న ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి

ఐరాల(కాణిపాకం), నవంబరు 26: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా ఆదివారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. వారిని ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి దర్శనానంతరం అలంకార మండపం వద్ద వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాబు, విఘ్నేష్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T01:10:13+05:30 IST