ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: అన్నప్రసాదం నాణ్యత లోపంపై స్పందించిన టీటీడీ ఛైర్మెన్

ABN, First Publish Date - 2023-12-05T13:39:20+05:30

తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బియ్యంలో నాణ్యత లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నప్రసాదం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదన్నారు. అదే సమయంలో మరో 700 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, ఆ భక్తులకులేని ఇబ్బంది మిగిలిన భక్తులకు ఎందుకు ఎదురైందో తెలియడంలేదన్నారు. ఇతర భక్తులను కొంత మంది భక్తులు రెచ్చగొట్టడం.. అక్కడ పని చేసే సిబ్బంది త్రాగుబోతులని ఆరోపించడం బాధాకరమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

కాగా తిరుమల వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసన తెలిపారు. భక్తులకు వడ్డించిన అన్నం బాగోలేదంటూ సిబ్బందిపై మండిపడ్డారు. ఇలాంటి అన్నం పెడతారా? అంటూ నిలదీశారు. అయితే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయమని టీటీడీ సిబ్బంది భక్తులను కోరారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది భక్తులకు సర్దిచెప్పి పంపించేశారు.

Updated Date - 2023-12-05T13:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising