ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat : విమానం వద్దని ‘వందేభారత్‌’లో సీఎస్‌ ప్రయాణం.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2023-04-09T21:44:10+05:30

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఆదివారం తిరుపతి నుంచి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రేణిగుంట: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఆదివారం తిరుపతి నుంచి గుంటూరుకు వందేభారత్‌ రైల్లో ప్రయాణించారు. తిరుపతి నుంచి సికింద్రాబాదుకు తొలిసారిగా బయల్దేరుతున్న వందేభారత్‌లోనే ప్రయాణించాలని ఆయన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. జిల్లా పర్యటన ముగించుకుని ఆయన మధ్యాహ్నం తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ చేరుకోగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy), డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జేసీ బాలాజి, స్టేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

వెయిటింగ్‌ లిస్టులో 50 మంది

తిరుపతి రైల్వేస్టేషన్‌ (Tirupati Railway Station) నుంచి తొలిసారిగా బయల్దేరుతున్న ఈ రైలు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. దాదాపు 50మంది వెయిటింగ్‌ లిస్టులో ఉండటం గమనార్హం. మొత్తం 598మంది పూర్తి సామర్థ్యంతో మధ్యాహ్నం 3.15 గంటలకు రైలు బయల్దేరింది. టిక్కెట్‌ చెకింగ్‌ ఆఫీసర్లగా తిరుపతికి చెందిన నలుగురు మహిళలు అనిత, శెల్వి, భారతి, రమణమ్మలను కేటాయించారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును(Vande Bharat Express train between Secunderabad and Tirupati) దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం ప్రారంభించనున్నారు.

వందేభారత్ ఎక్కడెక్కడ ఆగుతుందంటే..

సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయి.. నల్గొండ, ఒంగోలు, నెల్లూు స్టేషన్లలో ఆల్టింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు మొదలై మధ్యాహ్నం వరకు 2.30 వరకు తిరుపతిలో చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కి స్టార్ట్ అయి రాత్రి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది.

సికింద్రాబాద్ నుంచి వివిధ స్టేషన్లకు ధరలు ఇలా..

సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470

సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270

సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు

సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900

సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455

సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080

Updated Date - 2023-04-09T22:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising