ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డిపై 120 బి సెక్షన్ కింద సీబీఐ కేసు.. ఆ కథేంటో మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మాటల్లో..

ABN, First Publish Date - 2023-04-16T11:27:20+05:30

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లడం.. డీఐజీ స్థాయి అధికారిని నియమించడం.. ఈ నెలాఖరులోగా కేసును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిందన్నారు. దీంతో సీబీఐ విచారణ వేగవంతం చేసిందన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయడం.. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారంతో ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.

కాన్‌స్పిరసీ థీరీస్ (కుట్ర జరిగిందనే వాదన) ఎలా ఉంటుందంటే.. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖ వరకు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు విజయవాడ వరకు వస్తారని, కొంతమంది రాజమండ్రిలో దిగుతారని, మరికొందరు చివరి విశాఖ వరకు వస్తారన్నారు. వారంతా కాన్‌స్పిరసీలో భాగస్వాములేనన్నారు. 120 బి చాలా పెద్ద సెక్షన్ అని, ఇది అందరినీ అందులో భాగస్వామ్యం చేస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఎవరు ప్రయాణం చేస్తారో వారికి అంతా తెలుస్తుందని.. మధ్య మధ్యలో ఉన్నవారికి కొంత విషయం మాత్రమే తెలుస్తుందన్నారు.

ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత వెల్లడైన విషయాల ఆధారంగా ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నది..? ఎవరి ప్రొత్సాహంవల్ల జరిగింది.? అనే విషయాలు విచారణలో తేలుతాయని ఆయన అన్నారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి హత్య ఇన్ని సంవత్సరాలు పట్టడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి సీబీఐ నివేదికను సుప్రీం కోర్టుకు అందుజేస్తుందని తాను భావిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మినారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-16T12:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising