ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dastagiri: నా ప్రాణానికి హానీ జరిగితే అందుకు వారిద్దరే కారణం... కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-04-19T15:44:25+05:30

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jaganmohan Reddy) సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప జిల్లా ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. తనకు సీఎం జగన్ (AP CM), ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అదనపు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి పదేపదే తనపై మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా తనపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని తెలిపారు. ‘‘నా ప్రాణానికి ఏదైనా హాని జరిగితే అది ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి కారణం’’ అంటూ ఆవేదన చెందారు. తనకు రక్షణ కల్పించాలంటూ కడప జిల్లా ఎస్పీకి, కర్నూలు డీఐజీకి, సీబీఐ ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశారు.

కాగా... తప్పు తెలుసుకున్నాను కాబట్టే అప్రూవర్‌గా మారినట్లు నిన్న(మంగళవారం) ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దస్తగిరి చెప్పుకొచ్చారు. కేసుకు సంబంధించి ప్రతీ సాక్ష్యం సీబీఐ దగ్గర ఉందని, ఇప్పటికే పాత్రధారులం చిక్కామని.. త్వరలోనే సూత్రధారులు కూడా బయటకు వస్తారని దస్తగిరి వ్యాఖ్యానించించారు. వివేకాను ఎవరు చంపారో పులివెందులలో టీ షాప్‌కు వెళ్లి అడిగినా చెబుతారని, నిందితులు తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని దస్తగిరి తెలిపారు.

Updated Date - 2023-04-19T15:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising