AP News: జగన్కు గుడివాడ దళిత మహిళ పిండ ప్రదానం....
ABN, First Publish Date - 2023-11-06T16:26:52+05:30
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుడివాడ దళిత మహిళ పిండ ప్రదానం కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లా: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) గుడివాడ దళిత మహిళ పిండ ప్రదానం కలకలం రేపుతోంది. దళితులపై మూత్ర విసర్జన చేస్తున్నా పట్టించుకోని సీఎం జగన్మోహన్ రెడ్డికి పశువుల అశుద్ధంతో దళిత మహిళ పిండ ప్రదానం చేసింది. దళిత మహిళా నేత అసిలేటి నిర్మల గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో సీఎం జగన్ ఫ్లెక్స్కి చెప్పుల దండ వేసి పిండ ప్రదానం చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి, దళితుల సోదరుడుగా, మేనమామగా, బిడ్డగా చచ్చిపోయాడని ఈ సందర్భంగా దళిత మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో దళితులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని.. దళిత బిడ్డని చెప్పుకుంటున్నజగన్ రెడ్డి, తమపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించలేకపోతున్నారంటూ దళిత మహిళ అసిలేటి నిర్మల మండిపడింది.
Updated Date - 2023-11-06T16:26:54+05:30 IST