ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan Govt.: బైజూస్‌కు బై బై చెప్పిన జగన్ సర్కార్..!

ABN, First Publish Date - 2023-04-10T10:05:55+05:30

అమరావతి: నాడు ఆహా.. ఓహో అన్నారు. దీనితో విద్యార్థుల (Students) దశ తిరిగిపోతుందని చక్కగా సెలవిచ్చారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా మునిగిపోతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: నాడు ఆహా.. ఓహో అన్నారు. దీనితో విద్యార్థుల (Students) దశ తిరిగిపోతుందని చక్కగా సెలవిచ్చారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా మునిగిపోతున్న నావ లాంటి బైజూస్‌ (Byjus)కు బ్రాండ్ అంబాసిడర్‌ (Brand ambassador)లా వ్యవహరించారు. ఏడాది కాకముందే బైజూస్‌కు బై బై చెప్పేందుకు జగన్ సర్కార్ (Jagan Govt.) సిద్ధమైంది.

పాఠశాల విద్యపై వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ఏడాదికో ప్రయోగం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో తరగతులు విలీనంచేసి గందరగోళం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ-కంటెంట్‌ అంటూ మరో ప్రయోగానికి తెరదీసింది. ఇప్పటికే దాదాపు రూ.688 కోట్లు ఖర్చు చేసి పిల్లలకు బైజూస్‌ ట్యాబ్‌లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్‌ తయారీకి పూనుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సొంత కంటెంట్‌ అందుబాటులోకి వస్తుందంటూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) కొత్త హడావుడి ప్రారంభించింది. అలా అయితే ఈ ఏడాది ఆర్భాటంగా ప్రారంభించిన బైజూస్‌ కంటెంట్‌ను ఏంచేస్తారు? సీఎం జగన్‌ చెప్పిన రూ.778 కోట్ల కంటెంట్‌ ఏమైపోతుంది? ఆహా ఓహో అని పొగడ్తల వర్షం కురిపించిన బైజూస్‌ కంటెంట్‌పై ఒక్క ఏడాదిలోనే ఎందుకు నమ్మకం పోయింది? భారీగా ఖర్చు చేసి కొత్తగా కంటెంట్‌ తయారుచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

2022 డిసెంబరు 21న ప్రభుత్వం ఎనిమిదో తరగతి పిల్లలకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌ నింపిన ట్యాబ్‌లు పంపిణీ చేసింది. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59వేల మంది టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు ఇచ్చింది. ఇందుకోసం రూ.688 కోట్లు ఖర్చు చేసింది. పైగా కంటెంట్‌ ఎంతో విలువైందని, దాని విలువ అక్షరాలా రూ.778 కోట్లు అని సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ ఏడాదిలోపే అన్ని వందల కోట్ల కంటెంట్ తమకు పనికిరాదనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. సమాంతరంగా సొంత కంటెంట్ తయారు చేస్తోంది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ లోడ్ చేయగా నాలుగో తరగతి నుంచి పదో తరగతులు, మిగిలిన విద్యార్థులకు వారి సొంత ఫోన్లలో కంటెంట్ అప్ లోడ్ చేసింది. ఇలా 4 నుంచి 10 తరగతులకు బైజూస్ కంటెంట్ ఇవ్వగా ఎస్‌సీఈఆర్‌టీ సొంత కంటెంట్‌ రూపకల్పనకు తెరతీసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి దానిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంటే ఒక్క ఏడాదితోనే బైజూస్‌కు దాదాపుగా బైబై చెప్పేందుకు సిద్ధమైంది.

బైజూస్‌ కేవలం సబ్జెక్టుల కంటెంట్‌ మాత్రమే ఇస్తోంది. గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల ఈ-కంటెంట్‌ను విద్యార్థులకు అందిస్తోంది. అయితే ఇప్పుడు ఎస్‌సీఈఆర్‌టీ వాటితోపాటు భాషాసబ్జెక్టుల కంటెంట్‌ను కూడా తయారుచేస్తోంది. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ కంటెంట్‌ కూడా ఇస్తామని అధికారులు అంటున్నారు. 4 నుంచి 9 తరగతుల వరకు సీబీఎస్ఈ సిలబస్‌ కంటెంట్‌ కూడా రూపొందిస్తున్నారు. ఇందుకోసం విద్యార్థులకు ఒక మొబైల్‌ యాప్‌ను తయారుచేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దానిని వినియోగంలోకి ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే టీచర్ల బోధనే అక్కర్లేదని, మొత్తం ఈ-కంటెంట్‌తోనే పిల్లలు చదువుకుంటారని అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ట్యాబ్‌లు ఇవ్వడంతో పాటు వాటిని ప్రతిరోజూ కనీసం గంట సేపు చూడాలంటూ టీచర్లకు కండీషన్‌ పెట్టింది. అసలు ఇన్నేళ్లుగా పాఠాలు చెబుతున్న టీచర్లు.... బైజూస్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? బోధనలో వారి ఇన్నేళ్ల అనుభవం కంటే బైజూస్‌ గొప్పదా? అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసలు టీచర్లే అక్కర్లేదు అన్నట్టుగా ప్రభుత్వం, పిల్లల భవిష్యత్తుపై ప్రయోగాలు చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

రెండూ ఇస్తే ఇంకా గందరగోళం

ఒకవేళ అటు బైజూస్‌, ఇటు ఎస్‌సీఈఆర్‌టీ! వాటికి చెందిన రెండు కంటెంట్లూ ఒకేసారి పిల్లలపై రుద్దితే అది ఇంకా గందరగోళానికి దారితీస్తుంది. గణితం, సైన్స్‌, సోషల్‌కు బైజూస్‌ కంటెంట్‌ను... తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌కు ఎస్‌సీఈఆర్‌టీ కంటెంట్‌ ట్యాబ్‌లు, ఫోన్లలో అప్‌లోడ్‌ చేస్తే ఏది చదవాలో, ఏది చూడాలో అర్థంకాక విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. టీచర్ల బోధనతో చదువుకుంటున్న వారిపై బలవంతంగా బైజూస్ రుద్దారన్న అపవాదు ఉంది. దానికితోడు ఇప్పుడు సొంత కంటెంట్‌ వస్తోంది. ‘నాడు- నేడు’లో భాగంగా ఏర్పాటుచేయబోతున్న డిజిటల్‌ తరగతుల కోసమే ఈ కంటెంట్‌ తీసుకొచ్చారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో దాదాపు రూ.350 కోట్లతో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు ఏర్పాటుచేయబోతున్నారు. వాటి కొనుగోలుకు టెండర్లు పిలిచారు. వాటిని కొంటున్నందునే ఈ-కంటెంట్‌ను తయారుచేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

తేడా ఎక్కడొచ్చింది?

ఒప్పందం చేసుకున్న కొన్ని నెలల తర్వాత పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈలోగా బైజూస్‌తో ఏపీ ప్రభుత్వానికి కొంత గ్యాప్‌ ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో జరిగిన కొన్ని సమీక్షల్లో సీఎం...బైజూస్‌ అనే పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదని తెలిసింది. కానీ అప్పటికే ఒప్పందం చేసుకున్నందున వేరే దారిలేక ఆ సంస్థ కంటెంట్‌తోనే ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

Updated Date - 2023-04-10T10:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising