ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : ప్రభుత్వాధికారిని చెడుగుడు ఆడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ ప్రకటన జారీ చేసింది ఎవరో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-07-28T08:11:52+05:30

చిన్నారులు లీవ్ లెటర్ రాస్తే తప్పులు దొర్లడం సహజం. కానీ పెద్దవాళ్లు.. అందునా విద్యావంతులు.. మరీ చెప్పాలంటే జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన పత్రికా ప్రకటనలో తప్పులుంటే.. అది కూడా ప్రతి లైన్‌కీ రెండు మూడు తప్పులుంటే.. ట్రోలర్స్ ఊరుకుంటారా?

నంద్యాల : చిన్నారులు లీవ్ లెటర్ రాస్తే తప్పులు దొర్లడం సహజం. కానీ పెద్దవాళ్లు.. అందునా విద్యావంతులు.. మరీ చెప్పాలంటే జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన పత్రికా ప్రకటనలో తప్పులుంటే.. అది కూడా ప్రతి లైన్‌కీ రెండు మూడు తప్పులుంటే.. ట్రోలర్స్ ఊరుకుంటారా? అసలే ప్రస్తుతం సోషల్ మీడియా యమా యాక్టివ్ అయిపోయింది. తప్పు దొరికిందో ఆడేసుకుంటుంది. నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి 27 నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు.

ఆ పత్రికా ప్రకటనలో లెక్కపెట్టలేనన్ని తప్పులున్నాయి. మీమ్స్.. ట్రోల్స్‌తో ఉతికి ఆరేస్తోంది. నిజానికి ఆ లేఖను చూసిన వారికి మైండ్ బ్లాక్ అయి.. రెడ్ అయి రకరకాలుగా అయిపోవడం ఖాయం. జిల్లా విద్యాశాఖ కార్యాలయం మొదలు.. చివరి లైన్‌ వరకూ తప్పులతో నిండిపోయింది. నిజానికి ఆ లేఖను ఎవరో టైప్ చేశారు. కానీ జిల్లా విద్యాశాఖాధికారి అంతటి వారు సైన్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అదేమీ లేకుండా సైన్ చేసేశారు. ఇంకేముంది? అసలు విషయాన్ని వదిలేసి ఈ తప్పులను మాత్రం పట్టుకుని అండర్ లైన్ చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ లేఖపై మీరూ ఒక లుక్కేయండి.

Updated Date - 2023-07-28T08:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising