ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mohanbabu : రజనీకాంత్ వ్యవహరంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదు..

ABN, First Publish Date - 2023-06-01T11:11:23+05:30

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఏపీలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ వ్యవహారంలో జరిగిన రచ్చపై స్పందించారు. రజినీకాంత్ వ్యవహరంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదన్నారు. తాను ఇప్పుడు ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళబోనన్నారు. త్వరలో 100 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మిస్తున్నానన్నారు. చిత్రం వివరాలని త్వరలోనే విష్ణు వెల్లడిస్తాడని మోహన్ బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఏపీలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ వ్యవహారంలో జరిగిన రచ్చపై స్పందించారు. రజినీకాంత్ వ్యవహరంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదన్నారు. తాను ఇప్పుడు ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళబోనన్నారు. త్వరలో 100 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మిస్తున్నానన్నారు. చిత్రం వివరాలని త్వరలోనే విష్ణు వెల్లడిస్తాడని మోహన్ బాబు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళ నటుడు రజనీకాంత్ కేంద్ర బిందువుగా మారారు. రజనీ చుట్టే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం మాటల యుద్ధం చేసుకున్నాయి. రజనీపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చౌకబారు వ్యాఖ్యలు, సిల్క్ స్మిత లేఖ పేరుతో వైసీపీ చేస్తున్న హడావుడి ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. కొద్ది రోజుల పాటు రజనీపై వైసీపీ ఓ స్థాయిలో అవాకులుచవాకులు పేలింది. ఆ తరుణంలో మంచు మోహన్ బాబు మౌనం వహించడం మాత్రం ఇటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాలను కూడా విస్మయానికి గురిచేసింది.

రజనీతో తనకున్న సాన్నిహిత్యం గురించి పలు వేదికలపై సందర్భం ఉన్నా .. లేకున్నా ప్రస్తావిస్తూ.. రజనీని ‘అరేయ్ఒరేయ్’ అని పిలుస్తానని చెప్పుకునే మోహన్‌బాబు ఎందుకు మౌనం వహించారనే ప్రశ్న సోషల్ మీడియాను కుదిపేసింది. వాస్తవానికి మోహన్‌బాబు, రజనీకాంత్ మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. స్వార్థానికి దూరంగా, స్నేహానికి దగ్గరగా వారి సాన్నిహిత్యం ఉండేది. ఆర్థికంగా కష్ట కాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ తనకు సాయం చేశారని మోహన్‌బాబు చెప్పిన విషయం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు చాలామందికి తెలుసు. ఈ ఇద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉన్నప్పటికీ రజనీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వైసీపీ సోషల్ మీడియా సాక్షిగా దుష్ప్రచారం చేస్తుంటే మోహన్ బాబు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. ఈ పరిణామం ఈ ఇద్దరి స్నేహం గురించి తెలిసిన వారిని ఒకింత విస్మయానికి గురిచేసింది.

Updated Date - 2023-06-01T11:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising