ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Avinash Reddy : అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమేనా?

ABN, First Publish Date - 2023-04-17T11:11:20+05:30

ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే అవినాష్ రెడ్డి తాను నేడు పక్కాగా అరెస్ట్ అవుతానని భావిస్తున్నారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న.. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, జగన్‌ సతీమణి భారతీరెడ్డికి స్వయాన మేనమామ అయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఇక నేడు ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజామునే ఆయన భారీగా అనుచరులతో 10 కార్లలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు.

అయితే ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే అవినాష్ రెడ్డి తాను నేడు పక్కాగా అరెస్ట్ అవుతానని భావిస్తున్నారా? అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది. చీఫ్ జస్టిస్ బెంచ్‌లో అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అది నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు అంటే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు అరగంట ముందు విచారణకు అనుమతించే అవకాశం ఉంది. హైకోర్టులో ఉన్న అన్నికేసుల వివరాలు తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగా.. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిందని లాయర్ చెబుతున్నారు.

కాగా.. నిన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో దర్యాప్తు సంస్థ ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించింది. భాస్కర్ రెడ్డిని సైతం విచారణకు పిలిచి రాత్రి ఏడు గంటల వరకూ విచారించిన మీదట సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో నేడు అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇదే ధోరణిని అవలంభిస్తారా? అందుకే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారా? అనే సందేహాలు వస్తున్నాయి. కాగా.. 120బీ రెడ్‌విత్‌ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి, ఆయన భార్య లక్ష్మికి మెమో అందించారు. దానిపై ఆయనతో సంతకాలు చేయించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో పనిచేస్తున్న పి.జనార్దన్‌రెడ్డితో సాక్షి సంతకం పెట్టించారు.

Updated Date - 2023-04-17T11:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising