ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వేపై జేసీ తనిఖీ

ABN, First Publish Date - 2023-04-18T22:57:23+05:30

మండలంలో జరుగుతున్న భూముల రీసర్వేను మంగళవారం జాయింట్‌ కలెక్టరు కూర్మనాథ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వల్లూరు, మల్లూరు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే పనులను పరిశీలించారు.

సర్వే రాళ్లను పరిశీలిస్తున్న జేసీ కూర్మనాధ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, ఏప్రిల్‌ 18: మండలంలో జరుగుతున్న భూముల రీసర్వేను మంగళవారం జాయింట్‌ కలెక్టరు కూర్మనాథ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వల్లూరు, మల్లూరు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే పనులను పరిశీలించారు. గ్రామ సర్వేయర్ల ఆధ్వర్యంలో నాటుతున్న సర్వే రాళ్ల ప్లాంటేషన్‌ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని తనిఖీ చేశారు. ‘జగనన్న భూరక్ష పథకం’ కింద జరుగుతున్న భూముల రీసర్వే విషయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలని సూచించారు. శాశ్వత భూహక్కు, భూరక్షలో భాగంగా రీసర్వే నిర్వహించి, అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు. భవిష్యత్తులో రైతులకు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే శాఖ ఉన్నతాధికారులు, తహసీల్దారు సురేష్‌బాబు, మండల సర్వేయరు కామేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-18T22:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising