GVL: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు..

ABN, First Publish Date - 2023-06-05T13:09:08+05:30

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

GVL: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు (MP GVL Narasimharao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కూడా రైలు ప్రమాదంలో కుట్రకోణంపై ఆరా తీస్తోందని తెలిపారు. అవసరమైతే ఒడిశా రైల్వే ప్రమాదంపై సీబీఐతో (CBI) దర్యాప్తు చేస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠిణంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. ఒడిశా రైలు ప్రమాదం కారణంగా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8న హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన కూడా నిరాడంబరంగా జరుగుతుందని తెలిపారు. అమిత్ షా విశాఖ పర్యటనలో కేవలం కేంద్రం చేపతుడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రసంగించనున్నట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.

ఈరోజు ఉదయం విశాఖ జన శిక్షణ సంస్థాన్‌లో పీఎంకేవై శిక్షణ పొందిన వారికి ఎంపీ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఏడాది సుమారుగా 2500 మందికి శిక్షణ అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు సహకారం అందిస్తోందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-05T13:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising