ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TNSF Chief: బాబు ఆరోగ్యం క్షీణిస్తుంటే వెకిలి వేశాలు వేస్తారా?.. జగన్ & కోపై ప్రణవ్ ఫైర్

ABN, First Publish Date - 2023-10-13T14:54:25+05:30

రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కుట్రలు జరుగుతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు.

విశాఖపట్నం: రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (TDP Chief Chandrababu Naidu) కుట్రలు జరుగుతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (TNSF Chief Pranav Gopal) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బాబు ఆరోగ్యం క్షీణిస్తుంటే జగన్ (CM Jagan) అండ్ కో వెకిలి వేశాలు వేస్తోందని మండిపడ్డారు. 73 ఏళ్ల బాబు ఆరోగ్యంపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. స్కిన్ ఎలర్జీ, డిహైడ్రేషన్‌తో బాధపడుతుంటే జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు అనారోగ్యంతో బాధ పడుతుంటే వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. తక్షణమే చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి అధునాతన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగనే బాధ్యత వహించాలన్నారు. బాబు ఆరోగ్యం విషయంలో చిన్న తేడా వచ్చినా రాజమండ్రి సెంట్రల్ జైల్ భరోకి పిలుపునిస్తామని ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు.

Updated Date - 2023-10-13T14:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising