ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buddha Venkanna: అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైనే..

ABN, First Publish Date - 2023-11-26T13:47:08+05:30

ప.గో.జిల్లా: తెలుగుదేశం, జనసేన కూటములు అధికారంలోకి వస్తే నాలుగున్నరేళ్లలో వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తామని, అధికారంలోకి రాగానే మొదటి సంతకం దీనిపైనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు.

ప.గో.జిల్లా: తెలుగుదేశం (Telugudesam), జనసేన (Janasena) కూటములు అధికారంలోకి వస్తే నాలుగున్నరేళ్లలో వైసీపీ (YCP) విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తామని, అధికారంలోకి రాగానే మొదటి సంతకం దీనిపైనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న (TDP MLC Buddha Venkanna) స్పష్టం చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ చేపడుతున్నది బీసీ యాత్ర కాదని, బేవర్స్ బస్సు యాత్ర అని విమర్శించారు. ‘బస్సుల్లో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఫుల్.. సభలకు జనం నిల్’ అంటూ ఎద్దేవా చేశారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా పని లేని మంత్రులని అన్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదని, ఒకవేళ ఎవరైనా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నా అది అవాస్తవమని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు మళ్లీ జనంలోకి వస్తే రాష్ట్రంలో జన సునామీనేనని, పొత్తులపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానికి పార్టీ శ్రేణులంతా కట్టుబడి ఉంటామన్నారు. సోమవారం నుంచి రాజోలు నియోజకవర్గంలో జరిగే నారా లోకేష్ యాత్రలో టీడీపీతో పాటు జనసేన కూడా పాల్గొంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండకపోవచ్చునని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-26T13:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising