ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని మహిళకు బెదిరింపులు

ABN, First Publish Date - 2023-08-29T18:00:53+05:30

తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని యువతిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రథమ్ గుప్తాగా గుర్తించారు.

లక్నో: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని యువతిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రథమ్ గుప్తాగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌‌కు చెందిన ప్రథమ్ గుప్తా అనే నిందితుడు ఒక అమ్మాయిని తనతో స్నేహం చేయాలని బలవంతపెట్టాడు. తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి కాలేజీకి పోవడం కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత వారి మామ వాళ్ల ఇంటికి వెళ్లింది. యువతి ఫోన్ నంబర్ సంపాదించిన ప్రథమ్ గుప్తా తరచుగా కాల్స్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. యువతి ఫోటోలు కూడా తీశాడు. ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమె తండ్రికి, బంధువులకు పంపిచాడు. ఆ యువతి తండ్రితో తన బాధను చెప్పుకుంది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రథమ్ గుప్తాను అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన ప్రథమ్ గుప్తాను యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు.

Updated Date - 2023-08-29T18:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising