ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cash van looted: ఏటీఎం వ్యాన్ గార్డును కాల్చేసి.. నగదుతో పరారీ!

ABN, First Publish Date - 2023-01-10T20:53:48+05:30

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఏటీఎం వ్యాన్ (ATM) గార్డును కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నగదుతో పరారయ్యారు. నగర శివారులోని జగత్‌పూర్ ఫ్లై ఓవర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఏటీఎం వ్యాన్ (ATM) గార్డును కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నగదుతో పరారయ్యారు. నగర శివారులోని జగత్‌పూర్ ఫ్లై ఓవర్ (Jagatpur Flyover) సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం జగత్‌పూర్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఏటీఎంలో నగదు నింపేందుకు సాయంత్రం 4.50 గంటల సమయంలో వ్యాన్ అక్కడికి చేరుకుంది.

వ్యాన్ ఆగగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి వ్యాన్‌కు రక్షణగా ఉన్న గార్డును కాల్చేసి డబ్బుపెట్టెతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గార్డును ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-01-10T20:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising