ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allpass: విద్యాశాఖ కీలక ప్రకటన.. ‘1 నుంచి 8’ ఆల్‌పాస్‌

ABN, First Publish Date - 2023-04-22T07:31:48+05:30

ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry)లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్లు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయమై పుదుచ్చేరి, కారైక్కాల్‌ రీజియన్‌లలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఒక సర్క్యులర్‌ను పంపింది. 2021-22 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు పేర్కొంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు, మూడు నెలలు, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షల్లో పొందిన మార్కులను మార్కుల జాబితాలో పొందుపరచాలని పేర్కొంది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 35 శాతం మార్కులు పొందినట్టయితే ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించాలనింది. అదేవిధంగా 1వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థుల ఫలితాలను మే 8వ తేదీలోగా తెలియజేయాలని పేర్కొంది.

ఇదికూడా చదవండి: మరో ఆసక్తికర పోటీ.. తలపడుతున్న గురుశిష్యులు

Updated Date - 2023-04-22T07:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising