ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: సనాతన వివాదం.. మంత్రిపై చర్యలు చేపట్టాలంటూ పిటిషన్‌

ABN, First Publish Date - 2023-09-16T10:51:27+05:30

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను

పెరంబూర్‌(చెన్నై): సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇటీవల నగరంలో తమిళనాడు అభ్యుదయ రచయితల సంఘం నిర్వహించిన సనాతన నిర్మూలన సదస్సుకు హాజరైన మంత్రి ఉదయనిధి, కరోనా, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వాటిని నిర్మూలించినట్లు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ సహా హిందూ సంఘాలు మంత్రి ఉదయనిధికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టగా, పలు రాష్ట్రాల్లో ఉదయనిధిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజావ్యాజ్యంలో, సనాతన ధర్మం కోసం ఆరోపణలు చేసిన మంత్రి ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ కేసును అత్యవసరంగా పరిగణించి విచారణ చేపట్టాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ముందు పలువురు న్యాయవాదులు అభ్యర్థించారు. కానీ, ఇలాంటి అప్పీలుకు సమయం ముగిసిందని, కానీ న్యాయవాదులు అప్పీలు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధివిధానాలను సక్రమంగా పాటించి అప్పీలు దాఖలుచేయాలని న్యాయవాదులకు సూచించారు. దీంతో, వచ్చే మంగళవారం అప్పీలు చేయాలని న్యాయవాదులు నిర్ణయించారు.

Updated Date - 2023-09-16T10:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising