ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid cases record: దేశంలో 24 గంటల్లో 3,095 కొవిడ్ కేసులు...ఈ ఏడాది రికార్డ్

ABN, First Publish Date - 2023-03-31T10:53:36+05:30

దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది....

India records Covid cases
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,095 తాజా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్క రోజులో 3,095 కరోనా కేసులు వెలుగుచూడటం రికార్డు అని వైద్యులు చెప్పారు. దీంతో దేశంలో ప్రస్థుతం మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,208 కు పెరిగింది. బుధవారం 2,151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, రికవరీ రేటు ప్రస్తుతం 98.78 శాతంగా ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

ఇది కూడా చదవండి : Indore temple: కూలిన ఆలయం ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య

గోవా, గుజరాత్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 295 తాజా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది ఆగస్టు తర్వాత కరోనా వైరస్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారు.కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో 765 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలతో ఈ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని సానుకూల నమూనాలను పంపాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది.

ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో భారీగాలులతో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

గురువారం ఢిల్లీలో భరద్వాజ్ ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై కరోనా పరిస్థితిని సమీక్షించారు.ఇన్‌ఫ్లుఎంజా ఎ సబ్-టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.కరోనా రోగుల్లో ముక్కు కారటం, నిరంతర దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి.

Updated Date - 2023-03-31T11:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising