ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు

ABN, First Publish Date - 2023-07-02T10:25:49+05:30

కడుపు కాలిపోతున్నా పాకిస్థాన్ దుర్మార్గపు బుద్ధిలో మార్పు రావడం లేదు. సొంతింటిని చక్కదిద్దుకోవడం కన్నా భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది. తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కడుపు కాలిపోతున్నా పాకిస్థాన్ దుర్మార్గపు బుద్ధిలో మార్పు రావడం లేదు. సొంతింటిని చక్కదిద్దుకోవడం కన్నా భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది. తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపిస్తోంది. జమ్మూలోని భద్రతా దళాలు, శిబిరాలు, గస్తీ బృందాలపై గెరిల్లా దాడులు చేయించేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ వ్యూహంలో జమ్మూ, రాజౌరీ, పూంఛ్, రియాసీ జిల్లాలను లక్ష్యంగా చేసుకుంటోంది.

కౌంటర్ టెర్రరిజం అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం పాకిస్థాన్ మరిన్ని దారుణాలకు తెగబడుతోంది. కశ్మీరు లోయలోని హిందూ మైనారిటీలపై ఇప్పటి వరకు దాడులు చేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించిన పాకిస్థాన్ చెడు దృష్టి జమ్మూ, రాజౌరీ, పూంఛ్, రియాసీ జిల్లాలపై పడింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని మరింత పెంచాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ దుష్టపన్నాగాలకు దీటుగా స్పందించేందుకు భారతీయ భద్రతా దళాలు సమాయత్తమవుతున్నాయి.

మే 5న రాజౌరీలో 9 పారా ఎస్ఎఫ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. పూంఛ్ జిల్లాలో సైనిక వాహనంపై ఏప్రిల్ 20న జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. సుశిక్షితులైన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడ్డారు. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు, స్టిక్కీ బాంబులు ఉన్నాయి. గట్టి ప్రణాళికతో ఈ దాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా ఉగ్రవాదులు గెరిల్లా యుద్ధ తంత్రాలను అనుసరిస్తున్నారు. ఓ లక్ష్యంపై దాడి చేసి, తిరిగి పీర్ పంజల్ ప్రాంతంలోని అడవుల్లోకి పారిపోయి, మళ్లీ మరొక దాడికి సమాయత్తమవుతున్నారు. మొదటి దాడిలోనే భద్రతా దళాలను టార్గెట్ చేయడానికి బదులుగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

ప్రస్తుతం పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కనీసం 40 మంది అత్యంత కఠోర శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా. సరిహద్దుల్లో నియమితులయ్యే సైనికులను కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాకిస్థాన్ సైన్యం వాడుకుంటోందని కూడా భారత భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. పాకిస్థాన్ సుశిక్షితులైన ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత దేశంలోకి పంపిస్తోంది. ఈ ఉగ్రవాదులు అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నారు. వీరి కమాండర్లు జమ్మూ ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒకరిద్దరు సీనియర్ కమాండర్లు నేపాల్, లేదా, బంగ్లాదేశ్ గుండా జమ్మూలోకి ప్రవేశించి ఉంటారని భారత భద్రతా దళాలు భావిస్తున్నాయి.

జమ్మూ, రాజౌరీ, పూంఛ్ ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రిజర్వు పోలీస్ దళం (CRPF), జమ్మూ-కశ్మీరు పోలీసులు 948 గ్రామాల్లోని విలేజ్ డిఫెన్స్ గార్డులకు ఆయుధాల వాడకంలో, సరిహద్దుల్లో నిఘా పెట్టడంలో శిక్షణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Rajinikanth: అరుణాచలేశ్వరుడి సన్నిధిలో రజనీకాంత్‌

Updated Date - 2023-07-02T10:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising