ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allu Arjun: బన్నీకి అభిమానుల బ్రహ్మారథం

ABN, First Publish Date - 2023-01-20T15:41:56+05:30

‘పుష్ప: 2’ తాజా షెడ్యూల్ దాదాపుగా పది రోజుల పాటు కొనసాగనుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు బన్నీ వైజాగ్‌కు వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ప్రతి సినిమాకు పాత్రలో వైవిధ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. చివరగా ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) లో నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అప్పటి నుంచి ఆడియన్స్ అందరు రెండో భాగం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘పుష్ప: 2’ షూటింగ్ ప్రారంభమైంది. ఒక్క షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా మరో షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభం కానుంది. అందుకోసం ఐకాన్ స్టార్ అక్కడకు చేరుకున్నాడు.

‘పుష్ప: 2’ తాజా షెడ్యూల్ దాదాపుగా పది రోజుల పాటు కొనసాగనుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు బన్నీ వైజాగ్‌కు వచ్చాడు. ఇండిగో ప్లైట్‌లో హైదరాబాద్ నుంచి విశాఖ పట్టణానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు వైజాగ్ ఎయిర్ పోర్టులో బన్నీకి బ్రహ్మారథం పట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. అనంతరం బస కోసం నోవాటెల్ హోటల్‌కు వెళ్లాడు. ఇక ‘పుష్ప: 2’ విషయానికి వస్తే.. ‘పుష్ప: ది రైజ్’ సంచలన విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాలను మించి రాణించాలని చిత్రబృందం ప్రయత్నిస్తుంది. అందుకోసం స్క్రిఫ్ట్‌పై చిత్ర దర్శకుడు సుకుమార్ చాలా కాలం పనిచేశాడు. అందువల్ల ‘పుష్ప: 2’ పట్టాలెక్కేందుకు ఆలస్యమైంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

Updated Date - 2023-01-20T15:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising