Marriage: పెళ్లయిందన్న ఆనందం పట్టుమని 10 రోజులు కూడా లేదుగా.. పుట్టింటికని చెప్పి వెళ్లిన భార్య చేసిన నిర్వాకంతో..!

ABN , First Publish Date - 2023-07-26T13:27:01+05:30 IST

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెబుతారు. ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్ళి అనే బంధంతో ఒక్కటై జీవితాంతం కలసి ఉండటం ఈ బంధం మీద గౌరవాన్ని, పవిత్ర భావాన్ని పెంచుతుంది. ఆ ఇద్దరూ అదే భావంతో ఒకటయ్యారు. కానీ..

Marriage: పెళ్లయిందన్న ఆనందం పట్టుమని 10 రోజులు కూడా లేదుగా.. పుట్టింటికని చెప్పి వెళ్లిన భార్య చేసిన నిర్వాకంతో..!

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెబుతారు. ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్ళి అనే బంధంతో ఒక్కటై జీవితాంతం కలసి ఉండటం ఈ బంధం మీద గౌరవాన్ని, పవిత్ర భావాన్ని పెంచుతుంది. ఇదే భావంతో ఓ జంట పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. స్నేహితులు, బంధుమిత్రులతో పెళ్ళి మండపం కళకళలాడింది. కానీ పెళ్ళిజరిగిందన్న ఆనందం పట్టుమని 10రోజులు కూడా నిలవలేదు ఆ కుటుంబంలో. పుట్టింటికి వెళ్ళిన భార్య చేసిన పనికి వరుడితో పాటు అతని కుటుంబం కూడా అయోమయంలో పడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం భిల్వారా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని మండల్ నగరంలో మహవీర్ సుతార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి కిషన్ అనే కొడుకున్నాడు. మండల్ నగరానికి దగ్గర్లో ఉన్న అర్జియా గ్రామంలో మహవీర్ కు దూరపు బంధువులు ఉన్నారు. జూన్ నెలలో ఆ కుటుంబం మహవీర్ ఇంటికి వచ్చింది. వారు మహవీర్ తో మాట్లాడుతూ తమకు పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉందని చెప్పారు. అప్పటికే మహవీర్ తన కొడుకు కిషన్ కోసం వధువును వెతికే పనిలో ఉన్నాడు. తమ బంధువుకు పెళ్ళికావసిన కూతురు ఉందని చెప్పడంతో అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నాడు. మహవీర్ కుటుంబానికి అమ్మాయి నచ్చడంతో ఆమెను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామని అన్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా సరేననడంతో పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది.

Credit Card Penalty: క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టకపోయినా.. జరిమానా పడకుండా ఉండాలంటే..!



పెళ్లి కోసం మహవీర్ కుటుంబం అమ్మాయి కుటుంబానికి 4.21లక్షల రూపాయలు(4.21lakhs) ఇచ్చారు. ఇంకా అమ్మాయికి బంగారం, వెండి ఆభరణాలు(gold and silver) కూడా పెట్టారు. పెళ్ళి అనంతరం అమ్మాయిని తమతో అత్తారింటికి తీసుకెళ్ళారు. రెండురోజుల తరువాత అమ్మాయి తల్లిదండ్రులు వరుడి ఇంటికి చేరుకున్నారు. తమ సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని తమతో పుట్టింటికి పంపాలని, 10రోజులు పుట్టింట్లో ఉన్న తరువాత మళ్ళీ అమ్మాయిని తిరిగి పంపుతామని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళారు. 10రోజుల తరువాత మహవీర్ కొడుకు కిషన్ అమ్మాయిని తీసుకురావడానికి అత్తమామల ఇంటికి వెళ్ళాడు. అతిని అత్తమామలు అతన్ని చూసి 'నువ్వెవరో మాకు తెలీదు, మా అమ్మాయికి వేరేచోట సంబంధం నిర్ణయించాం' అని చెప్పారు. ఆ మాట వినగానే కిషన్ విస్తుపోయాడు. తాను దారితప్పి వచ్చానేమో అనుకున్నాడు. కానీ తను వచ్చిన ఇల్లు సరైనదేనని తేలడంతో తాము మోసపోయినట్టు కిషన్ కు అర్థమైంది(fake bride family cheating). అతను ఇంటికి వెళ్లి తండ్రికి విషయమంతా చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో ఇదంతా ఒక ముఠా పని అని తేలింది. వీరందరూ పెళ్లి కాని అబ్బాయిల కుటుంబాల గురించి ముందే తెలుసుకుని, పెళ్లిపేరుతో నమ్మించి, తీరా పెళ్ళయ్యాక ఇలా పారిపోతారని తెలిసింది. కాగా సదరు వధువు ఇప్పటికే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Amazing: ఈ బుడ్డోడి తెలివి ముందు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే బలాదూర్.. వయసు రెండున్నరేళ్లే కానీ..!


Updated Date - 2023-07-26T13:27:01+05:30 IST